భద్రాద్ర కొత్తగూడెం జిల్లాలో మావోలకు వ్యతిరేకంగా పోస్టర్లు

ABN , First Publish Date - 2020-09-28T04:28:20+05:30 IST

భద్రాద్ర కొత్తగూడెం జిల్లాలో మావోలకు వ్యతిరేకంగా పోస్టర్లు

భద్రాద్ర కొత్తగూడెం జిల్లాలో మావోలకు వ్యతిరేకంగా పోస్టర్లు

భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టులకు వ్యతిరేకంగా అశ్వాపురం మండలం మొండికుంటలో పోస్టర్లు వెలిశాయి. మావోయిస్ట్‌ల అక్రమ వసూళ్లు, ఆదివాసీలపై అరాచకాలు ఇంకెన్నాళ్ళు అంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఈ పోస్టర్లలో పేర్కొన్నారు. ఆదివాసీల ఉసురు తీస్తోంది ఎవరు?, నిరాయుదుల్ని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపుతున్నది ఎవరు అంటూ ప్రశ్నించారు. ఆదివాసీలను హత్య చేస్తున్నది మావోయిస్ట్ ముస్కరులే కదా అంటూ పోస్టర్లలో రాసి ఉంది. ఆదివాసీ అన్నలారా మావోయిస్టు పాముకు పాలు పోసినా అది మిమ్మలని కాటేసి చంపేస్తుందని పేర్కొన్నారు. మన ఆదివాసీల సమస్యలపై మనమే ప్రజా స్వామ్య బద్దంగా పోరాడుదామని పిలుపు నిచ్చారు. ‘‘మన భవిత మనమే నిర్మించు కుందాం’’ అనే అంశాలతో పోస్టర్లు వెలిశాయి. 

Updated Date - 2020-09-28T04:28:20+05:30 IST