రచ్చకెక్కిన లాలూ కుటుంబ కలహాలు!

ABN , First Publish Date - 2021-08-08T15:42:06+05:30 IST

రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి...

రచ్చకెక్కిన లాలూ కుటుంబ కలహాలు!

పట్నా: రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఇంట్లో చోటుచేసుకున్న విబేధాలు మరోమారు రోడ్డుకెక్కాయి. ఆర్జేడీ విద్యార్థి విభాగం తరపున పట్నా రోడ్లపై వెలిసిన పోస్టర్లలో తేజ్ ప్రతాప్‌తో పాటు తేజస్వీయాదవ్ ఫొటోలు మాయమయ్యాయి. ఆ పోస్టర్‌లో కేవలం లాలూ, రబ్రీదేవి ఫొటోలు మాత్రమే ఉన్నాయి. ఈ పోస్టర్లు కేవలం రోడ్ల పక్కనే కాకుండా, పార్టీ కార్యాలయం దగ్గర కూడా వెలిశాయి. ఈరోజు(ఆగస్టు 8) ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ పార్టీ విద్యార్థి నేతల సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో తేజ్‌ప్రతాప్ మద్దతుదారులు పట్నాలోని పలు ప్రాంతాల్లో పోస్టర్లు ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి తేజస్వీయాదవ్‌కు ఆహ్వానం పలకలేదు. కాగా గత జూన్ 11న పార్టీ 25వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పోస్టర్లలోనూ తేజ్ ప్రతాప్ యాదవ్ ఫొటో కనిపించలేదు.

Updated Date - 2021-08-08T15:42:06+05:30 IST