తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్
ABN , First Publish Date - 2021-02-25T06:51:16+05:30 IST
తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్ను అందించే తపాలా జీవిత బీమాలో ప్రతిఒక్కరూ సభ్యులు కావాలని ఏపీ సర్కిల్ చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ డాక్టర్ ఎం.వెంకటేశ్వర్లు అన్నారు.
కొత్తపేట, ఫిబ్రవరి 24: తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్ను అందించే తపాలా జీవిత బీమాలో ప్రతిఒక్కరూ సభ్యులు కావాలని ఏపీ సర్కిల్ చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ డాక్టర్ ఎం.వెంకటేశ్వర్లు అన్నారు. తపాలాశాఖ బుధవారం నిర్వహించిన భారీమేళాకు ముఖ్యఅతిథిగా వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తపాలా ఉద్యోగులందరూ ప్రతి గ్రామంలో పర్యటిస్తూ తపాలాశాఖ ద్వారా అందించే పథకాలు, బ్యాంకింగ్ సేవలపై అవగాహన కల్పించడంతోపాటు సభ్యులుగా చేరేందుకు కృషి చేయాలన్నారు. స్కూలు పిల్లలకు సిలటలీక్ క్లబ్ అక్కౌంట్లను తెరిపించారు. కరోనా సమయంలో కూడా విశేష సేవలందించిన తపాల ఉద్యోగులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రాంతం విశిష్టతను తెలిపేందుకుగాను ఆత్రేయపురం పూతరేకులు ముద్రతో కలిపే పోస్టల్ స్పెషల్ కవర్ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రతిఒక్కరూ తపాలాశాఖలో సభ్యులుగా చేరి శాఖ అభివృద్ధికి సహకరించాలని వెంకటేశ్వర్లు కోరారు. కార్యక్రమంలో అమలాపురం పోస్టల్ సూపరింటెండెంట్ కె.శ్రీరాములు, రాజారత్నం, సబ్డివిజనల్ ఇనస్పెక్టర్లు కోటేశ్వరరావు, రవికృష్ణ, ఫణి పాల్గొన్నారు.