పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న 748 మంది ఉద్యోగులు
ABN , First Publish Date - 2021-03-09T06:46:31+05:30 IST
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అవకాశాన్ని ఉద్యోగులు వినియోగించుకున్నారని వీఎంసీ కమిషనర్, అడిషనల్ ఎలక్షన్ అథారిటీ ప్రసన్న వెంకటేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
వన్టౌన్, మార్చి 8 : నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అవకాశాన్ని ఉద్యోగులు వినియోగించుకున్నారని వీఎంసీ కమిషనర్, అడిషనల్ ఎలక్షన్ అథారిటీ ప్రసన్న వెంకటేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తుమ్మల పల్లి కళాక్షేత్రంలో 64 డివిజన్లకు సంబంధించి ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగుల సౌకర్యార్థం ఈ నెల 7 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలో మొదటి రోజు 242 మంది, రెండో రోజు 506 మంది ఉద్యోగులు వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. 190 మందికి సర్వీసు ఓట్లను వినియోగించుకోవడానికి సర్వీస్ సిబ్బందికి పోస్ట్ ద్వారా పంపించామని కమిషనర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.