పోస్టల్‌ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-06-24T05:25:16+05:30 IST

పోస్టల్‌ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి

పోస్టల్‌ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి
వికారాబాద్‌ : ఎంపీ రంజిత్‌రెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న టీఆర్‌ఎస్‌ నాయకులు, పోస్టల్‌ సిబ్బంది

వికారాబాద్‌ : వికారాబాద్‌, తాండూరు పోస్టల్‌ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని చేవెళ్ల ఎంపీ డాక్టర్‌ రంజిత్‌రెడ్డికి నియోజకవర్గ పరిధిలోని తపాలాశాఖ సిబ్బంది విజ్ఞప్తి చేశారు. బుధవారం ధారూరు మండల అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, మాజీ మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ సంతో్‌షకుమార్‌లతో కలిసి ఎంపీ కార్యాలయంలో పోస్టల్‌ సిబ్బంది వినతిపత్రం అందజేశారు. వికారాబాద్‌, తాండూరు సిబ్బందిని సికింద్రాబాద్‌ డివిజన్‌ నుంచి సంగారెడ్డిలో కలపాలని శాఖ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారని, ఈ నిర్ణయంతో వైద్యపరంగా, జీడీఎస్‌ ఉద్యోగులకు ప్రమోషన్స్‌ పరంగా పలు ఇబ్బందులు ఎదుర్కొంటామని ఆందోళన వ్యక్తం చేశారు. సిబ్బంది సమస్య తెలుసుకున్న ఎంపీ వెంటనే చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ రాజేంద్రకుమార్‌తో ఫోన్‌లో మాట్లాడారు. కేంద్ర తపాలాశాఖ మంత్రిత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం జరిగేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఎంపీని కలిసిన వారిలో జీడీఎస్‌ యూనియన్‌ నాయకులు నాగభూషణం, ప్రభు, వెంకట్‌రెడ్డి, బాల్‌రెడ్డి, జనార్ధన్‌, ఎక్స్‌ పీ4 సెక్రటరీ అశ్వక్‌హుస్సేన్‌, పీ3 అసిస్టెంట్‌ సెక్రటరీ పురుషోత్తంరెడ్డి తదితరులున్నారు.

Updated Date - 2021-06-24T05:25:16+05:30 IST