నిర్వాసితుల సమస్యలపై కలెక్టర్‌కు పోస్టుకార్డులు

ABN , First Publish Date - 2022-06-29T05:35:52+05:30 IST

నిర్వాసిత సమస్యలు పరిష్క రించాలంటూ మండల నిర్వాసిత సంఘం కన్వీనర్‌ వై.నాగేంద్రరావు డిమాండ్‌ చేశారు.

నిర్వాసితుల సమస్యలపై కలెక్టర్‌కు పోస్టుకార్డులు
పోస్టుకార్డులు చూపుతున్న నిర్వాసితులు

కుక్కునూరు, జూన్‌ 28 : నిర్వాసిత సమస్యలు పరిష్క రించాలంటూ మండల నిర్వాసిత సంఘం కన్వీనర్‌ వై.నాగేంద్రరావు డిమాండ్‌ చేశారు. మంగళవారం సంఘం ఆధ్వర్యంలో పోలవరం నిర్వాసిత సమస్యలను పరిష్కరించాలంటూ పోస్టుకార్డు ద్వారా జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లేలా కార్డులను పోస్టు చేశారు. 2016 నుంచి పోలవరం నిర్వాసితులుగా గుర్తింపు పొందినప్పటికీ ఇంత వరకు వ్యక్తిగత పునరావాస పరిహారం, ఇంటి పరిహారం ఇవ్వడం లేదంటూ నిర్వాసితులు తమ ఆవేదన వెళ్ళబుచ్చారు. ప్రతీ ఏడాది జూన్‌ నుంచి సెప్టెంబర్‌ నెలలో  వచ్చే గోదావరి వరదలతో తీవ్ర ఇబ్బంది పడుతున్నట్టు నిర్వాసితులు తెలిపారు. కుక్కునూరు–1 బ్లాక్‌కు చెందిన దాదాపు 200 మంది నిర్వాసితులు పోస్టు కార్డు ఉద్యమంలో పాల్గొన్నారు.


Updated Date - 2022-06-29T05:35:52+05:30 IST