పులి చర్మం స్వాధీనం
ABN , First Publish Date - 2021-12-22T00:25:01+05:30 IST
ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి తెలంగాణకు తరలిస్తున్న పులి
ములుగు: ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి తెలంగాణకు తరలిస్తున్న పులి చర్మాన్ని వాజేడు మండలం వై జంక్షన్ వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశామన్నారు. నిందితులను మీడియా ముందు హాజరుపర్చి రిమాండ్కు తరలించామని ఎస్పీ తెలిపారు.
పులుల వేట
వరంగల్: జిల్లాలో పులుల వేట ఆగడం లేదు. పులులను చంపి అవయవాలను స్మగ్లింగ్ చేస్తున్నారు. పెద్దపులుల బలికి కేరాఫ్ అడ్రస్గా తెలంగాణ- ఛత్తీస్గఢ్ సరిహద్దులోని అభయ అరణ్యం మారింది. స్మగ్లర్ల వేటుకు మరో పెద్దపులి హతమైంది. పులి వరుస చర్మాల స్మగ్లింగ్ సంచలనం సృష్టిస్తోంది. చత్తీస్ గఢ్ నుంచి పట్టణ ప్రాంతాలకు తరలిస్తుండగా పులి చర్మంతో స్మగ్లర్లు పట్టుబడ్డారు. దీంతో వరుసగా మూడో పులి హతమైనట్లు పోలీసులు భావిస్తున్నారు. గతకొద్ది రోజులుగా వరంగల్ ఉమ్మడి జిల్లా ఏజెన్సీని వణికించిన పులి వేటగాళ్ల కాటుకు బలైనట్లు అనుమానం వ్యక్తం అవుతోంది. పులి చర్మం, గోర్లు పట్టణానికి తరలిస్తుండగా స్మగ్లర్లను పోలీసులు, అటవీశాఖ సిబ్బంది అరెస్ట్ చేశారు.