ఇళ్లపట్టాల పేరుతో రైతుల భూముల స్వాధీనం

ABN , First Publish Date - 2020-07-05T10:29:12+05:30 IST

ప్రభుత్వం ఇళ్లపట్టాల పేరుతో రైతుల భూములను స్వాధీనం చేసుకోవడం సరైంది కాదని, వారికి నష్టపరిహారం చెల్లించాలని మాజీ మంత్రి పల్లె

ఇళ్లపట్టాల పేరుతో రైతుల భూముల స్వాధీనం

వెంటనే నష్టపరిహారం చెల్లించాలి: మాజీ మంత్రి పల్లె


కొత్తచెరువు, జూలై 4: ప్రభుత్వం ఇళ్లపట్టాల పేరుతో రైతుల భూములను స్వాధీనం చేసుకోవడం సరైంది కాదని, వారికి నష్టపరిహారం చెల్లించాలని మాజీ మంత్రి పల్లె రఘునా థరెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. కొత్తచెరువు గ్రామ సమీపంలో దాదాపు 40 ఏళ్ల నుంచి లక్షలు వెచ్చించి భూములు చదును చేసుకుని సాగుచేసుకుంటున్నారన్నారు.


వాటిని స్వాధీనం చేసుకుని పేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. పేదలకు ఇళ్లపట్టాలను పంపిణీ చే యడానికి మేము వ్యతిరేకం కాదని, అయితే సాగులో ఉన్న రైతుల భూములను స్వాధీనం చేసుకోవడం దారుణమన్నారు. రైతులకు నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ఈ విషయాన్ని కలెక్టర్‌దృష్టికి తీసుకెళ్తామన్నారు.

Updated Date - 2020-07-05T10:29:12+05:30 IST