ఢిల్లీలో 2251 బుల్లెట్ల స్వాధీనం

ABN , First Publish Date - 2022-08-13T08:54:42+05:30 IST

స్వాతంత్య్ర వేడుకలు సమీపిస్తున్న వేళ దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు పెద్ద ఎత్తున బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ తూర్పు జిల్లాలో 2251 బుల్లెట్లను స్వాధీనం

ఢిల్లీలో 2251 బుల్లెట్ల స్వాధీనం

న్యూఢిల్లీ, ఆగస్టు 12: స్వాతంత్య్ర వేడుకలు సమీపిస్తున్న వేళ దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు పెద్ద ఎత్తున బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ తూర్పు జిల్లాలో 2251 బుల్లెట్లను స్వాధీనం చేసుకుని, ఆరుగురిని అరెస్ట్‌ చేసినట్టు శుక్రవారం అడిషనల్‌ పోలీస్‌ కమిషనర్‌ విక్రమ్‌జీత్‌ సింగ్‌ వెల్లడించారు. రెండు బ్యాగుల్లో వాటిని లఖ్‌నవూకు తరలిస్తుండగా పట్టుకున్నట్టు తెలిపారు. ఈ ఘటన వెనుక క్రిమినల్‌ నెట్‌వర్క్‌ ప్రమేయం ఉందని , అనిల్‌ అనే గ్యాంగ్‌స్టర్‌ పాత్ర ఉన్నట్టు తెలిపారు. ప్రస్తుతం మీరట్‌ జైలులో ఉన్న అనిల్‌ ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లోని ఓ గన్‌ హౌస్‌ నుంచి బుల్లెట్లను సమకూర్చినట్టు తెలిపారు. కాగా, కోల్‌కతాలో విక్టోరియా మెమోరియల్‌పై డ్రోన్‌ ఎగురవేసిన ఇద్దరు బంగ్లాదేశ్‌ జాతీయులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. విక్టోరియా మెమోరియల్‌, పరిసర ప్రాం తాల్లో ఫొటోలు తీసేందుకు డ్రోన్‌కు కెమెరాలు అమర్చినట్టు గుర్తించారు.   

Updated Date - 2022-08-13T08:54:42+05:30 IST