అలుగు స్వాధీనం
ABN , First Publish Date - 2022-06-30T04:56:20+05:30 IST
పోలాకి మండలం యాట్ల బసివలస గ్రామంలో అలుగును బుధ వారం స్వాధీనం చేసుకున్నట్లు తామరా పల్లి రేంజర్ పీవీ శాస్త్రి తెలిపారు.
నరసన్నపేట/పోలాకి: పోలాకి మండలం యాట్ల బసివలస గ్రామంలో అలుగును బుధ వారం స్వాధీనం చేసుకున్నట్లు తామరా పల్లి రేంజర్ పీవీ శాస్త్రి తెలిపారు. మంగళవారం రాత్రి చీడివలస కొండ నుంచి రోడ్డు మీదకు వస్తున్న అలుగును గ్రామానికి చెందిన కొందరు యువకులు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారి సూచనల మేరకు దానిని పట్టుకుని ఒక డ్రమ్లో భద్రపరిచారు. బుధవారం రేంజర్ శాస్త్రి, అధికారులు ఆర్.వినోద్కుమార్, రంజిత్కుమార్, శ్రీనివాసరావు గ్రామానికి వెళ్లి అలుగును స్వాధీనం చేసుకు న్నారు. దీనిని తామరాపల్లి అటవీశాఖ కార్యాలయంలో భద్రపరిచామని, ఉన్నతాధికారుల ఆదే శాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.