సాయిప్రణీత్కు పాజిటివ్
ABN , First Publish Date - 2021-01-21T09:44:16+05:30 IST
టొయోటా థాయ్లాండ్ ఓపెన్లో ఆడుతున్న భారత షట్లర్ భమిడిపాటి సాయి ప్రణీత్ కరోనా పాజిటివ్గా తేలాడు. దీంతో అతను టోర్నీ నుంచి తప్పుకొన్నాడు.
బ్యాంకాక్: టొయోటా థాయ్లాండ్ ఓపెన్లో ఆడుతున్న భారత షట్లర్ భమిడిపాటి సాయి ప్రణీత్ కరోనా పాజిటివ్గా తేలాడు. దీంతో అతను టోర్నీ నుంచి తప్పుకొన్నాడు. ఇక.. సాయి ప్రణీత్కు కొవిడ్ సోకడంతో అతని గదిలో ఉంటున్న మరో భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ కూడా టోర్నీ నుంచి వైదొలిగాడు. షట్లర్లందరికీ సోమవారం పీసీఆర్ టెస్ట్ నిర్వహించారు. బుధవారం వెల్లడైన ఈ ఫలితాల్లో సాయి ప్రణీత్కు కొవిడ్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించినట్టు థాయ్ బ్యాడ్మింటన్ సంఘం ప్రకటించింది. అతని గదిలోనే ఉంటున్న శ్రీకాంత్ నెగెటివ్ రిజల్ట్ వచ్చినా.. ముందు జాగ్రత్తగా అతను గదిలోనే పదిరోజుల ఐసొలేషన్లో ఉండాలని నిర్ణయించుకున్నాడు.