మరో ఎనిమిది మందికి పాజిటివ్
ABN , First Publish Date - 2020-07-10T10:19:41+05:30 IST
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 42 కేసులు నమైదయ్యాయి.
భూపాలపల్లి కలెక్టరేట్, జూలై 9: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 42 కేసులు నమైదయ్యాయి. కొత్తగా మరో ఎనిమిది మంది దీని బారిన పడ్డారని జిల్లా సర్వేలెన్స్ అధికారి డాక్టర్ జైపాల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. భూపాలపల్లి పట్టణంలోని శాంతినగర్, జవహర్నగర్, కారల్మర్క్స్కాలనీ, రాజీవ్నగర్ కాలనీల్లో నాలుగు, రెడ్డికాలనీలో రెండు, మొగుళ్లపల్లి మండలం అంకుషాపూర్లో ఒకరికి, రేగొండ మండలం గోరికొత్తపల్లి గ్రామానికి చెందిన మరొకరికి కరోనా నిర్ధారణ అయ్యినట్టు తెలిపారు.
పట్ణణంలోనే 14 కేసులు
జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 42 కేసుల్లో ఒక్క భూపాలపల్లి పట్టణంలో నే 16 కేసులు నమోదయ్యాయి. వీరిలో ముగ్గురు డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 13 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేసుల తీవ్రత రోజు రోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అప్రత్తంగా ఉంటూ ముందు జాగ్రత్తలు పాటిస్తేనే కరోనా నుంచి రక్షణ పొందొచ్చని డీఎంహెచ్వో జె.సుధార్సింగ్ అంటున్నారు. బహిరంగా ప్రదేశాల్లో తప్పక మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని సూచిస్తున్నారు.