సంగారెడ్డి జిల్లాలో 27 మందికి పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-07-04T11:27:54+05:30 IST

సంగారెడ్డి జిల్లాలో శుక్రవారం 27 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని డీఎంహెచ్‌వో డాక్టర్‌ మోజీరాంరాథోడ్‌

సంగారెడ్డి జిల్లాలో 27 మందికి పాజిటివ్‌

సంగారెడ్డి అర్బన్‌, జూలై 3 : సంగారెడ్డి జిల్లాలో శుక్రవారం 27 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని డీఎంహెచ్‌వో డాక్టర్‌ మోజీరాంరాథోడ్‌ తెలిపారు. సంగారెడ్డి-7, సదాశివపేట-7, ఆర్సీపురం-4, పటాన్‌చెరు-3, మల్కాపూర్‌-2, కంగ్టి మండలం తడ్కల్‌-1, మునిపల్లి మండలం మేలాసంఘం-1, అమీన్‌పూర్‌, నందికందిల్లో ఒక్కొటి చొప్పున కరోనా కేసు నమోదైందని పేర్కొన్నారు.


సంగారెడ్డి పట్టణంలో వీరభద్రనగర్‌లో ఒకరు, ఫ్రైడే మార్కెట్‌లో ఇద్దరు, రాజీవ్‌పార్కు సమీపంలో ఒకరు, శాంతినగర్‌లో ఒకరు, ఇంద్రనగర్‌ కాలనీలో ఒకరు, పోతిరెడ్డిపల్లి ఫేస్‌-2లో ఒకరికి కరోనా సోకిందని చెప్పారు. సంగారెడ్డి జిల్లా ఆస్పత్రి ఐసోలేషన్‌ నుంచి 68 మంది శాంపిళ్లను సేకరించి కొవిడ్‌ నిర్ధారణ కోసం గాంధీకి పంపామని తెలిపారు. సంగారెడ్డిలోని కరోనా వార్డులో పాజిటివ్‌ బాధితులు తొమ్మిది, కరోనా అనుమానిత లక్షణాలతో చేరిన వారు పది మంది ఉన్నారని డీఎంహెచ్‌వో డాక్టర్‌ మోజీరాంరాథోడ్‌ తెలిపారు.

Updated Date - 2020-07-04T11:27:54+05:30 IST