జమ్మూకశ్మీర్ యూనివర్శిటీలో 187 మంది విద్యార్థులకు COVID positive

ABN , First Publish Date - 2022-01-05T13:24:07+05:30 IST

జమ్మూకశ్మీరులోని శ్రీమాత వైష్ణోదేవి యూనివర్శిటీలో 187 మంది విద్యార్థులకు కరోనా సోకింది...

జమ్మూకశ్మీర్ యూనివర్శిటీలో 187 మంది విద్యార్థులకు COVID positive

జమ్మూ: జమ్మూకశ్మీరులోని శ్రీమాత వైష్ణోదేవి యూనివర్శిటీలో 187 మంది విద్యార్థులకు కరోనా సోకింది.మొదట 13 మంది విద్యార్థులకు కొవిడ్ వచ్చింది. అనంతరం కేవలం 4 రోజుల్లో యూనివర్శిటీలో కరోనా కేసుల సంఖ్య 187కు పెరగడంతో జనవరి 1వతేదీ నుంచి యూనివర్శిటీని మూసివేశారు.యూనివర్శిటీలోని విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందికి కరోనా పరీక్షలు చేస్తున్నారు. విద్యార్థులకు కరోనా సోకడంతో జనవరి 3వతేదీ నుంచి జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు.కరోనా కేసులు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రత దృష్ట్యా యూనివర్శిటీని మూసివేయాలని రియాసీ జిల్లా మెజిస్ట్రేట్ చరణ్ దీప్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. 


Updated Date - 2022-01-05T13:24:07+05:30 IST