పాజిటివ్ వచ్చినా విధుల్లో ప్రావీణ్యం!
ABN , First Publish Date - 2020-09-19T09:41:31+05:30 IST
పాజిటివ్ వచ్చినా విధుల్లో ప్రావీణ్యం!
క్వారంటైన్కు వెళ్లని ఓ ఐఏఎస్ కథ
అందరితో కలివిడిగా తిరిగారు దాంతో మరికొందరికి వైరస్
ఐఏఎస్ అధికారుల్లో కలకలం
క్వారంటైన్కు వెళ్లని ఉన్నతాధికారి
(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఓ ఉన్నతాధికారికి ఇటీవల కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. అయినా ఆయన క్వారంటైన్కి వెళ్లకుండా అందరితో కలివిడిగా తిరిగేశారు. ఇప్పుడు ఆయన కోలుకున్నా ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న మ రో ఉన్నతాధికారి, ఆయన పీఏ కొవిడ్ బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారులు హడలిపోతున్నారు. పాజిటివ్ అని తెలిసీ క్వారంటైన్కు వెళ్లని ఆ అధికారి తీరును విమర్శిస్తున్నారు. ఇటీవల ఒక జిల్లా కలెక్టరు కరోనా బారిన పడ్డారు. ‘విజయవాడ వెళ్లి కొందరు ఉన్నతాధికారులను కలిసిన తర్వాతే నాకు కరోనా సోకింది’ అంటూ ఆ కలెక్టరు వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం.