గుంటూరు జిల్లాలో 20కి పెరిగిన పాజిటీవ్ కేసులు

ABN , First Publish Date - 2020-04-03T15:28:48+05:30 IST

ఏపీ రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసులు అత్యధికంగా గుంటూరు జిల్లాలో నమోదయ్యాయి.

గుంటూరు జిల్లాలో 20కి పెరిగిన పాజిటీవ్ కేసులు

గుంటూరు: ఏపీ రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసులు అత్యధికంగా గుంటూరు జిల్లాలో నమోదయ్యాయి. బుధవారం ఒక్కరోజే 11 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో పాజిటీవ్ కేసులు 20కి పెరిగాయి. గతంలో ఉన్న ప్రాంతాలతోపాటు కొత్తగా అచ్చంపేట, క్రోసూరు, మంగళగిరి ప్రాంతాల్లో పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు నగరంలో గతంలో ఉన్న 4 కేసులకు మరో 5 కలవడంతో పాజిటీవ్ కేసుల సంఖ్య 9కి చేరింది. ఇక క్రోసూరులో 3, అచ్చంపేట, మంగళగిరి పట్టణాల్లో ఒక్కొక్క కేసు చొప్పున నమోదయ్యాయి. మాచర్లలో గతంలో 4 పాజిటీవ్ కేసులుండగా.. కొత్తగా మరో పాజిటీవ్ కేసు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో నమోదైన పాజిటీవ్ కేసులన్నీ ఢిల్లీ నుంచి వచ్చినవారు..వారి సంబంధీకులవేనని అధికారులు గుర్తించారు. దీంతో జిల్లా యంత్రాంగం, పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు.

Updated Date - 2020-04-03T15:28:48+05:30 IST