అందుబాటులో లేని పోసాని.. ఆందోళనలో నిర్మాతలు
ABN , First Publish Date - 2021-10-01T00:44:24+05:30 IST
అందుబాటులో లేని పోసాని.. ఆందోళనలో నిర్మాతలు
హైదరాబాద్: పోసాని కృష్ణమురళి కనిపించడంలేదంటూ నిర్మాతలు వాపోతున్నారు. కాంబినేషన్ షూటింగులకు అంతరాయం కలుగుతోందంటూ నిర్మాతలు చెబుతున్నారు. గత మూడు రోజులుగా పోసాని ఫోన్ ఆఫ్ చేసి ఉందని అంటున్నారు. ప్రెస్క్లబ్లో ప్రెస్మీట్ తర్వాత కంటాక్ట్ చేయడానికి కుదరడంలేదని పోసాని మేనేజర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. అయితే నిర్మాతలు ఆందోళనలో ఉన్నారు. పోసాని ఎప్పుడు అందుబాటులోకి వస్తారనేది తెలయడంలేదని వాపోతున్నారు.
కాగా ఏపీలో సినిమా టికెట్ల వివాదం రాజకీయంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ అంశం వైసీపీ వర్సెస్గా జనసేనగా మారింది. ఈ నేపథ్యంలో సినీ నటుడు పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కల్యాణ్పై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో తెలంగాణ జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోసాని ప్రెస్ మీట్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులతో తనకు ప్రాణ హాని ఉందని పోసాని వ్యాఖ్యానించారు. అయితే పోసాని ఇంటిపై రాళ్ల దాడి జరగడంతో ఇప్పుడు ఈ వివాదం మరింత ముదిరింది.