ఆలయంలో స్పీకర్ పోచారం ప్రత్యేక పూజలు
ABN , First Publish Date - 2020-06-07T10:28:29+05:30 IST
బీర్కూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో కొలువు దీరిన కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని శనివారం రాష్ట్ర శాసన
బీర్కూర్, జూన్ 6: బీర్కూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో కొలువు దీరిన కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని శనివారం రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి దర్శించుకున్నారు. స్వామి వారు, అమ్మ వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సన్నిధిలో కొనసాగు తున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని, త్వరి తగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మద్దినేని నాగేశ్వర్రావు, నర్సరాజు తదితరులున్నారు.30 మందికి నెగిటివ్గా నిర్ధారణ