కీలక నిర్ణయం దిశగా పోర్చుగల్

ABN , First Publish Date - 2020-04-11T02:39:07+05:30 IST

కరోనా వైరస్ భయపెడుతున్న నేపథ్యంలో పోర్చుగల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా వైరస్

కీలక నిర్ణయం దిశగా పోర్చుగల్

లిస్బన్: కరోనా వైరస్ భయపెడుతున్న నేపథ్యంలో పోర్చుగల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 15 వేలకు మించడంతో మే వరకు లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశం ఉందని సమాచారం. శుక్రవారం ఆ దేశ అధ్యక్షుడు మార్సెలో రెబోలో డి సౌసా మాట్లాడుతూ.. మే ఒకటో తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగించాలని ప్రతిపాదించనున్నట్టు ‘రాయిటర్స్’ పేర్కొంది. ఆయన ప్రతిపాదనను పార్లమెంటు ఆమోదించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ కేసులు నమోదవుతుండడంతో మార్చి 18న 15 రోజులపాటు అత్యవసర స్థితిని ప్రకటించింది. అయితే, గతవారం దానిని మరో 15 రోజులపాటు పొడిగించింది. ఇప్పుడు మరోమారు పొడిగించాలని యోచిస్తోంది. 

Updated Date - 2020-04-11T02:39:07+05:30 IST