శాంతిభద్రతల పరిరక్షణకు రక్షక దళ కమిటీలు

ABN , First Publish Date - 2020-10-02T08:20:12+05:30 IST

శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా డివిజన్లలో రక్షక దళ కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని పోర్టు పోలీస్‌స్టేషన్‌ సీఐ శ్రీనివాస్‌ అన్నారు.

శాంతిభద్రతల పరిరక్షణకు రక్షక దళ కమిటీలు

పోర్టు పోలీస్‌స్టేషన్‌ సీఐ శ్రీనివాస్‌ 


డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), అక్టోబరు 1: శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా డివిజన్లలో రక్షక దళ కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని పోర్టు పోలీస్‌స్టేషన్‌ సీఐ శ్రీనివాస్‌ అన్నారు. స్థానిక 10, 12 డివిజన్లలో రక్షక దళం కమిటీలను పోర్టు పోలీస్‌స్టేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. 10వ డివిజన్‌ దుమ్ములపేట తారకరామానగర్‌ ఏరియా, 12వ డివిజన్‌ నూకాలమ్మ అమ్మవారి ఆలయం ఏరియాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్న సీఐ శ్రీనివాస్‌ మాట్లాడారు. ఎస్‌ఐ శివకృష్ణ, ఏఎస్‌ఐ ప్రసాద్‌, 10వ డివిజన్‌ నాయకులు ఎరిపల్లి సీతారామరాజు, ఎరిపల్లి సత్యం, తిరుదు జగన్నాధం, డానియేల్‌, విధయ్‌రావు, 12వ డివిజన్‌ నాయకులు మట్టపర్తి రఘరామ్‌, రాంఖీఖాన్‌, పరశురామ్‌ పాల్గొన్నారు. 


రాజపూడిలో..

జగ్గంపేటరూరల్‌, అక్టోబరు 1: రాజపూడిలో గ్రామ రక్షణదళం ఏర్పాటుపై ఎస్‌ఐ టి.రామకృష్ణ సమావేశం నిర్వహించారు. ప్రతీ గ్రామంలో గ్రామ రక్షణ కోసం సమాజం పట్ల అవగాహన ఉన్న యువకులను రక్షణదళం ఏర్పాటుకు వినియోగిస్తామని, వీరికి గ్రామ మహిళా పోలీస్‌, వలంటీర్లు సహకారం అం దిస్తారని ఎస్‌ఐ తెలిపారు. రక్షణ దళంతో సమాచారం వెంటనే తెలుస్తుందని, సమస్యలు వెంటనే పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందన్నారు.

Updated Date - 2020-10-02T08:20:12+05:30 IST