పేదలకు నిత్యావసరాలు, బియ్యం పంపిణీ

ABN , First Publish Date - 2021-06-23T05:30:00+05:30 IST

వరల్డ్‌ విజన్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కందుకూరు పట్టణంలోని నిరుపేద కుటుంబాల వారికి నిత్యావసరాలు, బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒక్కో కుటుంబానికి 50 కిలోల బియ్యం, నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేసే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి ప్రారంభించారు

పేదలకు నిత్యావసరాలు, బియ్యం పంపిణీ
కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మహీధర రెడ్డి

 కందుకూరు, జూన్‌ 23: వరల్డ్‌ విజన్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కందుకూరు పట్టణంలోని నిరుపేద కుటుంబాల వారికి నిత్యావసరాలు, బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒక్కో కుటుంబానికి 50 కిలోల బియ్యం, నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేసే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు ముందుకొచ్చిన తీరు అభినందనీయమన్నారు. పట్టణంలో 500 కుటుంబాలకు తమ సంస్థ తరపు న నిత్యావసరాలు అందజేస్తున్నట్లు వరల్డ్‌విజన్‌ ప్రతినిధులు తెలిపారు.


Updated Date - 2021-06-23T05:30:00+05:30 IST