పేదల పెన్నిధి సీఎం కేసీఆర్
ABN , First Publish Date - 2021-04-17T05:14:05+05:30 IST
సీఎం కేసీఆర్ పేదల పెన్నిధిగా వెలుగొందుతున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. శుక్రవారం ఎంపీపీ కార్యాలయం ఆవరణలో షాదిముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను పంపి ణీ చేశారు.
ఉట్నూర్, ఏప్రిల్ 16: సీఎం కేసీఆర్ పేదల పెన్నిధిగా వెలుగొందుతున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. శుక్రవారం ఎంపీపీ కార్యాలయం ఆవరణలో షాదిముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను పంపి ణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏడాదిగా కరోనా వైరస్ ప్రజలను బెంబేలెత్తిస్తున్నా సీఎం కేసీఆర్ పేదలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సతీష్, ఎంపీడీవో తిరుమల, సింగిల్విండో చైర్మన్ సామ ప్రభాకర్రెడ్డి, మండల రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు అజిమొద్దీన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సింగారే భరత్, పట్టణ అధ్యక్షుడు జూవ్వాద్ అన్సారీ, ఎంఆర్ఐలు ప్రవీణ్, భారతీ, సర్పంచ్ హరినాయక్, తదితరులు పాల్గొన్నారు.