మళ్లీ నాసిరకం బ్యాగులే

ABN , First Publish Date - 2022-07-06T08:26:26+05:30 IST

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మంగళవారం విద్యార్థులకు పంపిణీ చేసిన విద్యాకానుక బ్యాగులు నాసిరకంగా ఉన్నాయంటూ పలువురు తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు. గతేడాది పంపిణీ చేసిన బ్యాగుల సైజులతో పోలిస్తే

మళ్లీ నాసిరకం బ్యాగులే

అభ్యంతరాలతో గతంలో ఆగిన సరఫరా

పైనుంచి ఆదేశాలతో తిరిగి అవే పంపిణీ


ఏలూరు ఎడ్యుకేషన్‌, భీమవరం ఎడ్యుకేషన్‌, జూలై 5: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మంగళవారం విద్యార్థులకు పంపిణీ చేసిన విద్యాకానుక బ్యాగులు నాసిరకంగా ఉన్నాయంటూ పలువురు తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు. గతేడాది పంపిణీ చేసిన బ్యాగుల సైజులతో పోలిస్తే ఈ ఏడాది విద్యార్థులకిచ్చిన బ్యాగులు చిన్నవిగా ఉన్నాయని, పుస్తకాలన్నీ బ్యాగులో సరిపోయేలా అవసరమైనంత స్థలం లేదని చెబుతున్నారు. బ్యాగుల ఎత్తు, వెడల్పు తగ్గాయంటున్నారు. బ్యాగ్‌ బరువు బాగా తక్కువ ఉందని, నాణ్యత కూడా లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. గత ఏడాది రెండు రంగుల బ్యాగ్‌లు ఇవ్వగా, ప్రస్తుతం ఒకే రంగులో అందిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఈ జిల్లాలోని కొన్ని మండలాల స్కూల్‌ కాంప్లెక్స్‌లకు సరఫరా అయిన బ్యాగుల నాణ్యతపై సందేహాలు రావడంతో, తనిఖీ నిమిత్తం కొన్నింటిని సమగ్రశిక్ష రాష్ట్ర కార్యాలయానికి పంపారు. పాఠశాలలకు వాటిని సరఫరా చేయకుండా నిలిపి వేసిన అధికారులు, పైనుంచి మౌఖిక ఆదేశాలతో తిరిగి వాటినే పంపిణీ చేసినట్టు సమాచారం. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించడానికి ఇష్టపడటం లేదు.

Updated Date - 2022-07-06T08:26:26+05:30 IST