నిరుపేదల ఆశాజ్యోతి ఎన్టీఆర్‌

ABN , First Publish Date - 2022-01-19T04:49:04+05:30 IST

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు నిరుపేదల ఆశాజ్యోతి అని రైల్వేకోడూరు టీడీపీ ఇన్‌చార్జ్‌ కస్తూరి విశ్వనాధనాయుడు అన్నారు.

నిరుపేదల ఆశాజ్యోతి ఎన్టీఆర్‌
రైల్వేకోడూరులో ఎన్టీఆర్‌ చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న కస్తూరి విశ్వనాధనాయడు

రైల్వేకోడూరు, జనవరి 18: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు నిరుపేదల ఆశాజ్యోతి అని రైల్వేకోడూరు టీడీపీ ఇన్‌చార్జ్‌ కస్తూరి విశ్వనాధనాయుడు అన్నారు. మంగళవారం రైల్వేకోడూరులో ఎన్టీఆర్‌ 26వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్‌ అనతి కాలంలోనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని తెలిపారు. పేదల కోసం నిరంతరాయంగా పని చేసిన ఘనత ఎన్టీఆర్‌కు దక్కుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ శాప్‌ డైరెక్టర్‌ దుద్యాల జయచంద్ర, రాజంపేట పార్లమెంట్‌ టీడీపీ ఉపాధ్యక్షుడు పి.రమే్‌షబాబు, తదితరులు పాల్గొన్నారు.


రాజంపేటలో ఘన నివాళి

రాజంపేట, జనవరి 18 : ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా మంగళవారం రాజంపేట పాతబస్టాండు వద్ద ఆయన విగ్రహానికి టీడీపీ నేతలు పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి  నివాళులర్పించారు. ఈ సందర్భంగా జోహార్‌ ఎన్టీఆర్‌ అంటూ నినాదాలు చేశారు. లెజండరీ బ్లడ్‌ డొనేషన్‌ డ్రైవ్‌లో 150 మంది రక్తదానం చేశారు. పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బి.చెంగల్‌రాయులు, టీడీ పీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి చెన్నూరు సుధాకర్‌, ఎద్దల విజయసాగర్‌,  రాజంపేట పార్లమెంట్‌ మహిళాధ్యక్షురాలు అనసూయాదేవి  తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-19T04:49:04+05:30 IST