పూలే విగ్రహ నిర్మాణానికి స్థలం కేటాయించాలి
ABN , First Publish Date - 2021-04-13T07:04:23+05:30 IST
కైకలూరులో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ నిర్మాణానికి స్ధలాన్ని కేటాయించాలని బీసీ సంఘాల నాయకులు కోరారు.
కైకలూరు : కైకలూరులో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ నిర్మాణానికి స్ధలాన్ని కేటాయించాలని బీసీ సంఘాల నాయకులు కోరారు. డిప్యూటీ తహసీల్దార్ ఆర్.రాంబాబుకు ఈమేరకు వినతిపత్రం అందేజేశారు. తాలుకాసెంటర్లోని ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో విగ్రహ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని కోరారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గంగునేని వరప్రసాద్, జిల్లా కార్యదర్శి గంగుల అశోక్, నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు తుపాకుల సోమాచారి, ఆచవరం సర్పంచ్ కట్టా నాగరాజ్గౌడ్ పాల్గొన్నారు.