పూజ గది తలుపే మృత్యుపాశమైంది

ABN , First Publish Date - 2021-09-16T04:30:30+05:30 IST

v

పూజ గది తలుపే మృత్యుపాశమైంది

దేవుడికి పూజ చేస్తుండగా విద్యుదాఘాతం

ఆక్కడికక్కడే మహిళ  మృతి

చండ్రుగొండ, సెప్టెంబరు 15: పూజ గది తలుపు మృత్యుపాశమైంది. దేవుడిక పూజ చేద్దామని అనుకుంటుండగా ఇనుప తలుపునకు విద్యుత్‌ ప్రసారమై ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈసంఘటన మండల పరిధిలోని సీతాయిగూడెంలో మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత జరిగింది. గ్రామానికి చెందిన బేతి లక్ష్మి(46) భర్త సీతారాములు నాలుగు సంత్సరాల క్రితం మృతి చెందాడు. అప్పటి నుంచి కొడుకు, కుతురుతో కలిసి జీవిస్తోంది. లక్ష్మి ఎక్కువగా పూజలు చేస్తుంటుంది. ఇంట్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పూజ గదికి ఇనుప తలుపు ఏర్పాటు చేశారు. ఆ తలుపు పై నుంచి దేవుడి దగ్గర వెలిగేలా బల్బును ఏర్పాటు చేశారు. విద్యుత్‌ వైరు పూజ గదికి అమర్చారు. ఆ తీగ నలిగి ఇనుప తలుపునకు విద్యుత్‌ సరఫరా అయింది. లక్ష్మి తలుపును తాకడంతో షాక్‌ గురై కుప్పకూలింది. అపస్మారక స్థితిలో ఉన్న లక్ష్మిని వెంటనే కుటుంబ సభ్యులు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే లక్ష్మి మరణించినట్లు వైద్యులు తెలిపారు. కుమారుడు వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు ఎస్సై రాజేష్‌కుమార్‌ కేసు నమోదు చేశారు.

Updated Date - 2021-09-16T04:30:30+05:30 IST