ఘనంగా అయ్యప్ప మహాపడిపూజ

ABN , First Publish Date - 2020-12-01T04:28:38+05:30 IST

ఘనంగా అయ్యప్ప మహాపడిపూజ

ఘనంగా అయ్యప్ప మహాపడిపూజ
అయ్యప్ప స్వామికి అభిషేకం చేస్తున్న శబరిమల అయ్యప్ప దేవస్థానం అర్చకుడు సుధీర్‌ లంబోద్రి

మర్పల్లి: సిరిపురం గ్రామంలోని దత్తాత్రేయస్వామి ఆలయ ఆవరణలో అయ్యప్ప మహాపడిపూజ ఘనంగా నిర్వహించారు. కేరళలోని అయ్యప్ప దేవస్థానం ప్రధాన పూజారి సుధీర్‌ లం బోద్రిచే తెల్లవారుజాము నుంచి గణపతిహోమం, అయ్యప్పగుడి శంకుస్థాపన, మహాపడిపూజ, అభిషేకాలు, అయ్యప్ప పల్లకిసేవ తదితరకార్యక్రమాలు నిర్వహించారు. సర్పంచ్‌ మల్లయ్య ఏర్పాటు చేసిన మహాపడిపూజ కార్యక్రమంలో సుమారు 500 మందికి పైగా అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అఖిల భారత అయ్యప్ప స్వామి సేవాసమితి అధ్యక్షుడు రాచర్ల రమేష్‌, సేవాసమితి సభ్యులు ముత్తంగి నర్సింగ్‌రావు, భజన కమిటీసభ్యులు, గురుస్వాములు నరేష్‌, శ్రీకాంత్‌, ప్రవీణ్‌, వినోద్‌, మధుకర్‌, నర్సింహులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-01T04:28:38+05:30 IST