కేంద్రమే ధాన్యం కొనాలి: పొన్నం ప్రభాకర్

ABN , First Publish Date - 2022-04-12T20:04:19+05:30 IST

ప్రతి గింజా కొంటాం అని బండి సంజయ్ మాట ఇచ్చాడు.. కనుక రాష్ట్రంతో సంబంధం లేకుండా కేంద్రమే ధాన్యం కొనాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు.

కేంద్రమే ధాన్యం కొనాలి:  పొన్నం ప్రభాకర్

కరీంనగర్:  ప్రతి గింజా కొంటాం అని బండి సంజయ్ మాట ఇచ్చాడు.. కనుక  రాష్ట్రంతో సంబంధం లేకుండా కేంద్రమే ధాన్యం కొనాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ధాన్యం కొనకపోవడంతో రైతులు అరిగోస పడాల్సి వస్తోందని పొన్నం ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-04-12T20:04:19+05:30 IST