‘బ్యాంకుల సొంత డబ్బుకాదు అది ప్రజల డబ్బు’
ABN , First Publish Date - 2022-07-19T23:07:18+05:30 IST
దేశంలో, రాష్ట్రంలో అరవై ఐదు శాతం మంది ప్రజలు వ్యవసాయ మీద ఆధారపడి జీవిస్తున్నారని మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు.
హైదరాబాద్: దేశంలో, రాష్ట్రంలో అరవై ఐదు శాతం మంది ప్రజలు వ్యవసాయ మీద ఆధారపడి జీవిస్తున్నారని మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల బ్యాంకుల్లో వేసే డబ్బులని బ్యాంకులు అప్పల కింద జమ చేసుకుంటున్నాయన్నారు. 14శాతం ఉన్న పెద్ద రైతులకు ప్రభుత్వం 54 శాతం రుణాలు ఇస్తున్నట్లు చూపిస్తుందన్నారు. బ్యాంకుల సొంత డబ్బులు కాదు ఇది ప్రజల డబ్బులన్నారు. పది శాతం కూడా వ్యవసాయా లోన్స్ ఇవ్వడం లేదన్నారు. రైతుల ఇబ్బందులను ఆర్బిఐ రీజినల్ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాలరి సూచించారు.