Sudhakar Reddy: మా ఓటింగ్ శాతం పెరిగింది..
ABN , First Publish Date - 2022-09-08T14:36:18+05:30 IST
తమిళనాడులో తమ ఓటింగ్ శాతం పెరిగిందని బీజేపీ రాష్ట్ర ఇన్చార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి(Ponguleti Sudhakar Reddy) తెలిపారు. బుధవారం
తిరుమల, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులో తమ ఓటింగ్ శాతం పెరిగిందని బీజేపీ రాష్ట్ర ఇన్చార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి(Ponguleti Sudhakar Reddy) తెలిపారు. బుధవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. ఆయన మాటల్లోనే.. ‘తమిళనాడులో మంచి ఫౌండేషన్ వేసుకున్నాం. ప్రతి ఒక్కరిలోనూ మార్పు వస్తోంది. అందరూ బీజేపీ వైపు చూస్తున్నారు. గులాంనబీ ఆజాద్ వంటి నాయకులు కాంగ్రెస్ వదిలిపెట్టి పోతున్నారు. ఈ సమయంలో భారత్ జోడో యాత్ర(Bharat Jodo Yatra) కన్నా.. కాంగ్రెస్ జోడో యాత్రను రాహుల్ గాంధీ చేస్తే బాగుంటుంది. గతంలో నేను కూడా కాంగ్రెస్కు బలమైన కార్యకర్తనే. ఇక అమెరికా కంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉంది. ప్రపంచ అగ్రనాయకుడిగా ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi)ని అమెరికా డేటా ఏజెన్సీ గుర్తించడం గర్వంగా ఉంది. తమిళనాడులో కూడా 28శాతం తెలుగువాళ్లున్నారు. ఎన్నికలుప్పుడు రాజకీయాలు ఉండవచ్చు.. అభివృద్ధిలో ఉండకూడదు. భేదాభిప్రాయాలు, ద్వేషాలు లేకుండా సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలే తప్ప కేంద్రాన్ని నిత్యం టార్గెట్ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం కరెక్ట్ కాదని సుధాకర్ రెడ్డి సూచించారు.