ఓర్వలేక అధికార పార్టీ దాడులు

ABN , First Publish Date - 2020-05-25T10:02:36+05:30 IST

ఫార్మాసిటీ రహదారి పనుల శంకుస్థాపన సంద ర్భంగా యాచారం ఎంపీపీ కొప్పు సుకన్యబాషాపై ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రవర్తించిన తీరు ..

ఓర్వలేక అధికార పార్టీ దాడులు

 ఎంపీపీపై ఎమ్మెల్యే తీరు దారుణం\

పోలీసుల పనితీరుపై నమ్మకం పోతోంది

మాజీ ఎంపీ వివేక్‌, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి


యాచారం: ఫార్మాసిటీ రహదారి పనుల శంకుస్థాపన సంద ర్భంగా యాచారం ఎంపీపీ కొప్పు సుకన్యబాషాపై ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రవర్తించిన తీరు దారుణమని మాజీ ఎంపీ వివేక్‌, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం వారు మండల కేంద్రంలో ఎంపీపీ కొప్పు సుకన్యబాషా ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న ప్రజాప్రతినిధిపై దాడులు సమంజసం కాదన్నారు. ఎంపీపీ చేస్తున్న మంచి పనులు చూసి ఓర్వలేకనే అధికార టీఆర్‌ఎస్‌ దాడులకు దిగుతుందన్నారు. అదేవిధంగా పోలీసులపై ప్రజలకు నమ్మకం లేకుండా పోతుందని విమర్శిం చారు.


ఎమ్మెల్యే తీరు తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతిపక్షాల పట్ల సీఎం తీరు కూడా దారుణంగా ఉందన్నారు. ఎంపీపీకి న్యాయం జరిగేంత వరకు రాష్ట్ర పార్టీ కార్యవర్గం నిరంతరం పోరాడుతుందన్నారు. ఫార్మాసిటీకి భూసేకరణ చట్ట విరుద్ధంగా ఉందని ఆరోపించారు. వారివెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, నాయకులు నర్సింహారెడ్డి,  మండలాధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, నాయకులు రవి, జంగయ్య, శాంతి కుమార్‌, సాయికుమార్‌, తదితరులు పాల్గొన్నారు. 


దళితులకు రక్షణ కరువైంది : అద్దంకి దయాకర్‌

రాష్ట్రంలో దళితులకు రక్షణ కరువైందని మాల మహానాడు జాతీయాధ్యక్షుడు అద్దంకి దయాకర్‌ అన్నారు. ఆదివారం ఆయన యాచారంలోని ఎంపీపీ కొప్పు సుకన్యభాషా దంపతులను ఆయన పరామర్శించారు. ప్రోటోకాల్‌ నిబంధనలు పాటించకుండా ఎంపీపీని కించపరచడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధిని కించపరచడం ప్రజాస్వామాన్ని అపహాస్యం చేయడ మేనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - 2020-05-25T10:02:36+05:30 IST