ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారు: పొంగులేటి

ABN , First Publish Date - 2021-04-14T17:46:23+05:30 IST

భారత రాజ్యాంగం రచించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 130వ జయంతిని ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం ఉందని...

ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారు: పొంగులేటి

హైదరాబాద్: భారత రాజ్యాంగం రచించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 130వ జయంతిని ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం ఉందని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం వ్యవహరించాలన్నారు. పశ్చిమబెంగాల్‌లో‌ మమత బెనర్జీ రాజ్యాంగం, తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతామని హామీ ఇచ్చారని.. అది ఇంత వరకు అమలులోకాలేదని పొంగులేటి సుధాకర్ అన్నారు.

Updated Date - 2021-04-14T17:46:23+05:30 IST