మోదీతోనే పొందూరు ఖాదీకి వైభవం

ABN , First Publish Date - 2021-08-06T05:17:19+05:30 IST

ప్రధాని మోదీ సాయంతో పొందూరు సన్నఖాదీ వస్త్రాలకు మరింత వైభవం తీసుకురానున్నట్లు బీజేపీ ఉత్తరాంధ్ర అభివృద్ధి కమిటీ కన్వీనర్‌, రాష్ట్ర కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడు గద్దె బాబూరావు తెలిపారు.

మోదీతోనే పొందూరు ఖాదీకి వైభవం
మాట్లాడుతున్న గద్దె బాబూరావు


 బీజేపీ ఉత్తరాంధ్ర అభివృద్ధి కమిటీ కన్వీనర్‌ బాబూరావు

పొందూరు:  ప్రధాని మోదీ సాయంతో పొందూరు సన్నఖాదీ వస్త్రాలకు మరింత వైభవం తీసుకురానున్నట్లు  బీజేపీ ఉత్తరాంధ్ర అభివృద్ధి కమిటీ కన్వీనర్‌, రాష్ట్ర కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడు గద్దె బాబూరావు తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని శనివారం పొందూరులో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ పర్యటన పురస్కరించుకొని  గురువారం ఏర్పాట్లను జిల్లా బీజేపీ నాయకు లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర చేనేత సెల్‌ సభ్యుడు బండారు ప్రతాప్‌ ఆధ్వర్యంలో విలేకరులతో మాట్లాడారు. పొందూరు ఖాదీకి గుర్తింపు తీసుకురావడం బీజేపీతోనే సాధ్యమన్నారు.  కేంద్ర ఆర్థిక మంత్రి చేనేతదినోత్సవంలో పాల్గొనడం కోసం మారుమూల ఉన్న పొందూరును ఎంచుకోవడం ,చేనేత, ఖాదీరంగాలకు బీజేపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత, ఈ ప్రాంతంపై ఉన్న మమకారం తెలియజేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైడి వేణుగోపాలం, పార్టీ  జిల్లా అధ్యక్షుడు అట్టాడ రవిబాబ్జి, నాయకులు శవ్వాన ఉమామహేశ్వరి, కిల్లి శ్రీరామమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

సభా ఏర్పాట్ల పరిశీలన

పొందూరులో శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి పర్యటన పురస్కరించుకొని  సభా ఏర్పాట్లను శ్రీకాకుళం, హౌసింగ్‌ జేసీలు సుమిత్‌కుమార్‌, హిమాంశ కౌషిక్‌ గురువా రం పరిశీలించారు. స్థానిక  మార్కెట్‌ కమిటీ ఆవరణలో సభ, వివిధ శాఖలు బ్యాంకు లు నిర్వహించనున్న స్టాళ్లు, భోజనశాల ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకు న్నారు. ఏఎఫ్‌కేకే సంఘాన్ని సందర్శించి సంఘ ప్రతినిధులకు సూచనలు చేశారు.  




Updated Date - 2021-08-06T05:17:19+05:30 IST