పొల్లూరు జలపాతంలో పడి యువకుడి మృతి

ABN , First Publish Date - 2022-07-04T06:13:40+05:30 IST

అల్లూరి సీతారామరాజు జిల్లా మోతుగూడెం సమీపంలోని పొల్లూరు జల పాతంలో మునిగి ఆదివారం ఓ వ్యక్తి మృతిచెందాడు.

పొల్లూరు జలపాతంలో పడి యువకుడి మృతి

మోతుగూడెం, జూన్‌ 3: అల్లూరి సీతారామరాజు జిల్లా మోతుగూడెం  సమీపంలోని పొల్లూరు జల పాతంలో మునిగి ఆదివారం ఓ వ్యక్తి మృతిచెందాడు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన తొమ్మిది మంది పొల్లూరు జలపాతం చూసేందుకు వచ్చారు.   జలపాతం వద్ద సెల్ఫీలు దిగుతుండగా ఇద్దరు కాలు జారి పడిపోయారు అక్కడే ఉన్న ఈతగాళ్లు వారిని బయటకు తీశారు. వారిలో మంతిన ఆనందబాబు(23) ప్రాణాలు కోల్పోయాడు. ఆనందబాబు ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఈ నెలాఖరులో ఉద్యోగంలో చేరాల్సి ఉంది.  యువకుడి మృతిపై మోతుగూడెం పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2022-07-04T06:13:40+05:30 IST