రాజకీయంగా ఎదుర్కోలేక ఈడీని ఉసిగొల్పుతున్నారు: జగ్గారెడ్డి

ABN , First Publish Date - 2022-06-16T01:15:20+05:30 IST

రాజకీయంగా ఎదుర్కోలేక ఈడీని ఉసిగొల్పుతున్నారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

రాజకీయంగా ఎదుర్కోలేక ఈడీని ఉసిగొల్పుతున్నారు: జగ్గారెడ్డి

హైదరాబాద్: రాజకీయంగా ఎదుర్కోలేక ఈడీని ఉసిగొల్పుతున్నారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్త పాదయాత్రతో బీజేపీని నిలదీయడానికి కాంగ్రెస్ నేత రాహుల్ సిద్దమయ్యారని తెలిపారు. రాహుల్ పాదయాత్ర నిర్ణయంతో బీజేపీలో భయం మొదలైందన్నారు. రాహుల్ పాదయాత్రను అడ్డుకునేందుకే ఈడీ విచారణ చేస్తోందన్నారు. కేంద్రం వైఖరికి నిరసనగా గురువారం రాజ్‌భవన్ ముట్టడిస్తామని, రాజ్‌భవన్ గేట్లు బద్దలు కొడతామని జగ్గారెడ్డి హెచ్చరించారు.

Updated Date - 2022-06-16T01:15:20+05:30 IST