-
-
Home » Andhra Pradesh » Politician Bojjala Gopalakrishnareddy death is tragic Lokesh-MRGS-AndhraPradesh
-
రాజనీతిజ్ఞుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మృతి బాధాకరం: లోకేష్
ABN , First Publish Date - 2022-05-06T23:03:05+05:30 IST
రాజనీతిజ్ఞుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మృతి బాధాకరం: లోకేష్
హైదరాబాద్: టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి, రాజనీతిజ్ఞుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మృతి బాధాకరమని ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఎన్నో కీలక నిర్ణయాల్లో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి విలువైన సలహాలు ఇచ్చిన వ్యూహకర్త అని లోకేష్ తెలిపారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు లోకేష్ వెల్లడించారు. మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కొంతకాలంగా అనారోగ్యంలో బాధపడుతున్నారు. హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గోపాలకృష్ణారెడ్డి srikalahasti constituency నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మాజీ సీఎం Chandrababu కాబినెట్లో ఆయన అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. అలిపిరి ఘటనలో చంద్రబాబుతో పాటు బొజ్జల కూడా గాయపడ్డారు. తీవ్ర అనారోగ్యంతో మూడు నెలలపాటు ఆస్పత్రిలో ఉన్న బొజ్జల ఇటీవలే కొంత కోలుకొని ఇంటికి తిరిగి వచ్చారు. ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో తిరిగి ఆయనను కుటుంబసభ్యులు అపోలో ఆసుపత్రిలో చికిత్స అందించారు.