జనసేనకు ఓట్లు వేశామనే దాడి చేశారు
ABN , First Publish Date - 2021-04-11T05:22:44+05:30 IST
జనసేనకు ఓట్లు వేశామనే కారణంతో తమ ఇళ్లపై దాడిచేశారని మహిళలు నిరసన ప్రదర్శన చేశారు.
దూసనపూడిలో మహిళల నిరసన
వీరవాసరం, ఏప్రిల్ 10 : జనసేనకు ఓట్లు వేశామనే కారణంతో తమ ఇళ్లపై దాడిచేశారని మహిళలు నిరసన ప్రదర్శన చేశారు. దూసనపూడిలో జనసేన, వైసీపీ వర్గాల మధ్య జరిగిన దాడి, ఘర్షణపై గ్రామంలోని శనివారం కొద్దిసేపు ఆందోళన చేశారు.దాడిని ప్రశ్నించినందుకే సర్పంచ్ యర్రంశెట్టి నాగసాయిపై దాడికి పాల్పడ్డారని విమర్శించారు. వైసీపీ నాయకులు గ్రామంలో భయబ్రాంతులు సృష్టిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే వైసీపీ కార్యకర్తలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే వైసీపీ నాయకుడు సవరం కిశోర్పై దాడికి పాల్పడిన సర్పంచ్ యర్రంశెట్టి నాగసాయి, జనసేన కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని మండల వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. వీరవాసరంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. గ్రామాల్లో జనసేన గొడవలు ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ఈ సమావేశంలో గూడూరి ఓంకార్, పోలిశెట్టి సత్యనారాయణ(దాసు), చికిలే మంగతాయారు, నాగరాజు శ్రీనివాసరాజు, గొలగాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.