రాజకీయ కక్షసాధింపులు తగదు
ABN , First Publish Date - 2020-08-15T09:11:20+05:30 IST
ప్రజలు కరోనా మహమ్మారితో దిక్కుతోచని స్థితిలో ఉంటే ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిన రాష్ట్ర ప్రభుత్వం అగ్ని ప్రమాదం లాంటి దురదృష్టకర ఘటన
ఎండీ హిదాయత్
గుంటూరు, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): ప్రజలు కరోనా మహమ్మారితో దిక్కుతోచని స్థితిలో ఉంటే ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిన రాష్ట్ర ప్రభుత్వం అగ్ని ప్రమాదం లాంటి దురదృష్టకర ఘటనను రాజకీయ ప్రయోజనాలకు వాడకోవటం దారుణమని టీడీపీ నేత ఎండీ హిదాయత్ అన్నారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. నాలుగు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్న రాయపాటి కుటుంబ సభ్యులను విచారణ పేరుతో వేధించటం సరికాదని హితవు పలికారు. ఘటనపై నిస్పక్షపాతంగా దర్యాప్తు చేసి దోషులను శిక్షించాలి కాని రాజకీయ కక్షలు దీనికి ముడిపెట్టటం సరికాదని పేర్కొన్నారు.