తెలంగాణలో రాజకీయ శూన్యత వల్లే కొత్త పార్టీలు: పేర్నినాని

ABN , First Publish Date - 2021-10-29T21:00:22+05:30 IST

తెలంగాణలో రాజకీయ శూన్యత వల్లే కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయని మంత్రి పేర్ని నాని చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో

తెలంగాణలో రాజకీయ శూన్యత వల్లే కొత్త పార్టీలు: పేర్నినాని

అమరావతి: తెలంగాణలో రాజకీయ శూన్యత వల్లే కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయని మంత్రి పేర్ని నాని చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో 151 స్థానాలు వచ్చిన తర్వాత శూన్యత ఎక్కడుంది? అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల ప్రజల మనసుల్లో శూన్యత లేదన్నారు. నదీ జలాల వినియోగంలో సీఎం కేసీఆర్ మాటతప్పారని విమర్శించారు. ఏపీకి కేటాయించిన నీటిలో అదనంగా చెంచాడు నీళ్లు కూడా వినియోగించబోమన్నామని చెప్పారు. డిండి-పాలమూరు ప్రాజెక్టుల్లో తాగునీరు పేరుతో సాగుకు మళ్లించారని పేర్ని నాని ఆరోపించారు. 

Updated Date - 2021-10-29T21:00:22+05:30 IST