మహిళలకు రాజకీయ చైతన్యం కావాలి
ABN , First Publish Date - 2021-03-08T05:03:54+05:30 IST
మహిళలు రాజకీయంగా చైతన్య వంతులు కావాలని రాజ్యసభ మాజీ సభ్యురాలు, టీడీపీ నరసాపురం అధ్యక్షురాలు తోట సీతారా మలక్ష్మి పిలుపునిచ్చారు.
తోట సీతారామలక్ష్మి పిలుపు
భీమవరం: మహిళలు రాజకీయంగా చైతన్య వంతులు కావాలని రాజ్యసభ మాజీ సభ్యురాలు, టీడీపీ నరసాపురం అధ్యక్షురాలు తోట సీతారా మలక్ష్మి పిలుపునిచ్చారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె మాటల్లోనే.. కుటుంబానికే పరిమితమైన నేను సుమారు 20ఏళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చాను. నా భర్త, కుటుంబ సభ్యులు ఎంతో సహకరించారు. భీమవరం మున్సిపల్ చైర్మన్గా, తరువాత టీడీపీ జిల్లా అధ్యక్షురాలిగా, రాజ్యసభ సభ్యురాలిగా, ప్రస్తు తం నరసాపురం నియోజకవర్గ అధ్యక్షురాలిగా నా ఆలోచనలు అమలు చేస్తున్నాను. మహిళలు రాజకీయాలలో స్వయం ఆలోచనతో ఎదగాలి.
–––––––––––––––––––––––––