నిందితులు బస్సులో.. పోలీసులు విమానంలో.. చివరికి..!
ABN , First Publish Date - 2021-02-23T13:58:03+05:30 IST
. అప్రమత్తమైన పోలీసులు విమానంలో కోల్కత్తాకు వెళ్లగా...
- కోల్కత్తాలో ముగ్గురు నిందితుల అరెస్ట్
- రూ.4.50 లక్షలు స్వాధీనం
హైదరాబాద్/బంజారాహిల్స్ : బేకరీలో డబ్బు చోరీ చేసి బస్సులో కోల్కత్తాకు పారిపోతున్న ముగ్గురు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. రోడ్డు నెంబరు 10లోని వాక్స్ బేకరీలో గత వారం ఏడు లక్షల రూపాయల నగదు చోరీ అయింది. సెక్యూరిటీ గార్డు సోహిదుల్ అస్లాం మీద అనుమానం వ్యక్తం చేస్తూ బేకరీ నిర్వాహకుడు అమర్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. సీసీ కెమెరాలను పరిశీలించగా సోహిదుల్ అస్లాంకు ఎల్బీనగర్కు చెందిన సెక్యూరిటీ గార్డు అలిముద్దిన్ షేక్, అక్సెదుల్ అలీ సహకరించినట్టు తేలింది. సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వారు బస్సులో కోల్కత్తా పారిపోతున్నట్టు పోలీసులు గుర్తించారు. అప్రమత్తమైన పోలీసులు విమానంలో కోల్కత్తాకు వెళ్లారు. నిందితులు బస్సులో ఉండగానే అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.4.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.