కరోనా వార్డులో కానిస్టేబుల్ కలకలం!
ABN , First Publish Date - 2020-05-24T14:14:10+05:30 IST
మహారాష్ట్రలోని అకోలాలోగల మెడికల్ కాలేజీలోని కరోనా బాధితుల వార్డులోకి ఒక పోలీసు రాక కలకలం సృష్టించింది. ఆ పోలీసు కరోనా వార్డులోకి ప్రవేశించి, వీడియో తీయడం ప్రారంభించాడు. అయితే అతను...
అకోలా: మహారాష్ట్రలోని అకోలాలోగల మెడికల్ కాలేజీలోని కరోనా బాధితుల వార్డులోకి ఒక పోలీసు రాక కలకలం సృష్టించింది. ఆ పోలీసు కరోనా వార్డులోకి ప్రవేశించి, వీడియో తీయడం ప్రారంభించాడు. అయితే అతను పీపీఈ కిట్ ధరించకుండా రావడం ఆందోళనకరంగా మారింది. వీడియో రికార్డింగ్ గురించి తెలియగానే వార్డు వెలుపల నిలబడిన భద్రతా సిబ్బంది ఆ పోలీసును ప్రశ్నించారు. తరువాత వార్డు ఇన్చార్జి వైద్యుడు ఆ పోలీసును ఎందుకు వీడియో రికార్డ్ చేస్తున్నావని అడిగారు. దీంతో ఆ పోలీసు తనను ప్రశ్నిస్తున్న డాక్టర్ను కూడా వీడియోలో బంధించాడు. దీంతో అక్కడున్న సిబ్బంది ఆ పోలీసు దగ్గరున్న ఫోను లాక్కొనేందుకు ప్రయత్నించారు. దీంతో వివాదం చోటుచేసుకుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం పోలీసుకు చెందిన బంధువును వార్డులో చేర్చారు. ఈ నేపధ్యంలోనే అతను వీడియో తీశాడని తెలుస్తోంది. చివరికి వైద్యాధికారుల జోక్యంతో ఆ పోలీసు తన ఫోనులోని వీడియోలను వారికి అప్పగించడంతో సమస్య సద్దుమణిగింది.