వైసీపీ ఎమ్మెల్యేకు వత్తాసుపలికిన పోలీసులు

ABN , First Publish Date - 2022-03-09T22:29:41+05:30 IST

వైసీపీ ఎమ్మెల్యేకు పోలీసులు వత్తాసుపలికారు. గ్రామాభివృద్ధిపై ఎమ్మెల్యేను ప్రశ్నించిన టీడీపీ కార్యకర్త అంజిబాబుపై పోలీసులు జులుం ప్రదర్శించారు.

వైసీపీ ఎమ్మెల్యేకు వత్తాసుపలికిన పోలీసులు

జంగారెడ్డిగూడెం: వైసీపీ ఎమ్మెల్యేకు పోలీసులు వత్తాసుపలికారు. గ్రామాభివృద్ధిపై ఎమ్మెల్యేను ప్రశ్నించిన టీడీపీ కార్యకర్త అంజిబాబుపై పోలీసులు జులుం ప్రదర్శించారు. జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురంలో ఈ ఘటన జరిగింది. గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభించేందుకు చింతలపూడి  ఎమ్మెల్యే ఎలిజా వచ్చారు. తమ గ్రామంలో అభివృద్ధి జరగలేదని ఎమ్మెల్యేను టీడీపీ కార్యకర్త అంజిబాబు నిలదీశారు. ‘నన్ను అడగడానికి ఎవరు నువ్వు’ అంటూ అంజిబాబుపై ఎమ్మెల్యే మండిపడ్డారు. ఓటర్‌గా అడుతుగుతున్నానని అంజిబాబు అనడంతో ఆగ్రహంతో ఊగిపోయారు. అంతటితో ఆగకుండా అంజిబాబును పక్కకు లాగేయండని అంటూ పోలీసులకు ఎమ్మెల్యే హుకుం జారీ చేశారు. అంజిని బలవంతంగా లాక్కెళ్ళి  జంగారెడ్డిగూడెం ఎస్సై పోలీస్ జీపు ఎక్కించాడు. పలువురు సర్దిచెప్పడానికి ప్రయత్నించినా పోలీసులు వినలేదు, ప్రశ్నిస్తే కేసులు పెట్టి బలవంతంగా అరెస్ట్ చేస్తారా అంటూ టీడీపీ నేతల ఆందోళనకు దిగారు. 



Updated Date - 2022-03-09T22:29:41+05:30 IST