రెండేళ్ల క్రితం హత్య కేసును ఛేదించిన అవనిగడ్డ పోలీసులు
ABN , First Publish Date - 2020-10-09T00:17:05+05:30 IST
రెండేళ్ల క్రితం ఎలాంటి ఆధారాలు లేకుండా ఓ వ్యక్తిని హత్య చేసిన కేసును అవనిగడ్డ పోలీసులు ఛేదించారు...
కృష్ణా: రెండేళ్ల క్రితం ఎలాంటి ఆధారాలు లేకుండా ఓ వ్యక్తిని హత్య చేసిన కేసును కృష్ణా జిల్లా అవనిగడ్డ పోలీసులు ఛేదించారు. పొలం కోసం రెండేళ్ల క్రితం లింగం రాజేంద్రప్రసాద్(54) అనే వ్యక్తిని హత్య చేసి మృతదేహాన్ని సముద్రపు పాయలో పడవేశారు. హతుడు అవివాహితుడు, తీర్థయాత్రలు చేసే అలవాటు ఉన్న వ్యక్తి కావడంతో హంతకులు తమకు అనుకూలంగా మలచుకున్నారు. హంతకుల్లో ఒకరైన లింగం అనిల్ కుమార్ మృతుడు రాజేంద్రప్రసాద్కు చెందిన 2.80 ఎకరాల పొలాన్ని తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో తన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఈ విషయం తెలిసిన రాజేంద్రప్రసాద్ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రాజేంద్రప్రసాద్ను అడ్డు తొలగించుకునేందుకు మరో నలుగురితో కలసి పథకం పన్ని 2018 ఆగస్టులో అనిల్ కుమార్ హత్య చేశాడు. మృతుడి సోదరి ఇచ్చిన ఫిర్యాదుతో శిథిలమయిన రాజేంద్రప్రసాద్ ఇంటి వద్ద ఆధారాలు సేకరించిన పోలీసులు ఎట్టకేలకు హత్య కేసును ఛేదించారు.