టీడీపీ దళిత నేతల వాహనాలను అడ్డుకున్న పోలీసులు
ABN , First Publish Date - 2020-09-27T22:13:51+05:30 IST
యడ్లపాడు హైవేపై టీడీపీ దళిత నేతల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. చిలకలూరిపేటలో దళితుల శ్మశానవాటిక సందర్శనకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.
గుంటూరు: యడ్లపాడు హైవేపై టీడీపీ దళిత నేతల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. చిలకలూరిపేటలో దళితుల శ్మశానవాటిక సందర్శనకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. పాదయాత్రగా వెళ్లేందుకు యత్నించారు. అయినా.. టీడీపీ బృందాన్ని అడ్డుకున్నారు. మాజీ మంత్రి ఆనందబాబు నేతృత్వంలో నిజనిర్దారణ కమిటీ చిలకలూరిపేటలో పర్యటించింది.