అంత్యక్రియల మధ్యలోనే సగం కాలిన మృతదేహాన్ని చితిపై నుంచి లాగేసిన పోలీసులు.. ఆ రాత్రి అసలేం జరిగిందంటే..
ABN , First Publish Date - 2022-07-16T21:09:13+05:30 IST
కన్న తల్లిదండ్రులే కొడుకును హత్య చేసి, రహస్యంగా అంత్యక్రియలు జరిపిస్తున్న వైనం ఆగ్రాలో వెలుగులోకి వచ్చింది.
కన్న తల్లిదండ్రులే కొడుకును హత్య చేసి, రహస్యంగా అంత్యక్రియలు జరిపిస్తున్న వైనం ఆగ్రాలో వెలుగులోకి వచ్చింది. ఆ వ్యక్తి అత్తమామల ఫిర్యాదుతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు చితి మీద సగం కాలిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ మృతదేహాన్ని పోస్ట్మార్టమ్కు తరలించారు. పోలీసులు వచ్చిన విషయం తెలుసుకున్న హతుడి కుటుంబ సభ్యులు ఇంటి నుంచి పారిపోయారు.
ఇది కూడా చదవండి..
Second Marriage Rules: ప్రభుత్వ ఉద్యోగులు రెండో పెళ్లి చేసుకోవాలంటే.. కొత్త రూల్స్ను ప్రకటించిన Bihar సర్కారు
ఆగ్రాకు సమీపంలోని చావ్రి గ్రామానికి చెందిన నేపాల్ సింగ్ను అతని తల్లిదండ్రులు, సోదరుడు, సోదరి కలిసి హత్య చేశారని అతడి అత్తమామలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకున్నారు. అప్పటికే నేపాల్ సింగ్ మృతదేహానికి అతడి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. స్మశానానికి వెళ్లిన పోలీసులు సగం కాలిన స్థితిలో ఉన్న నేపాల్ సింగ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టమ్కు తరలించారు. పోలీసుల రాక గురించి తెలుసుకున్న నేపాల్ సింగ్ తల్లిదండ్రులు గ్రామం నుంచి పరారయ్యారు.
కొంతకాలం క్రితం నేపాల్ సింగ్ తన పేరున ఉన్న భూమిని విక్రయించాడు. భూమి అమ్మగా వచ్చిన డబ్బు విషయంలో కుటంబ సభ్యుల మధ్య గొడవ మొదలైంది. దీంతో స్వంత వ్యక్తులే అతని ప్రాణాలను తీశారని నేపాల్ సింగ్ అత్తమామలు ఆరోపిస్తున్నారు. నేపాల్ సింగ్ హత్యకు గురైనప్పుడు, అతని భార్య పుట్టింట్లో ఉంది. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.