ఓనర్‌ని బ్లాక్‌మెయిల్ చేసిన ఉద్యోగి.. మెట్రో స్టేషన్ వద్ద అనుమాస్పదంగా పడి ఉన్న సూట్ కేసు.. అసలా ఓనర్ ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2022-02-17T05:35:45+05:30 IST

మెట్రో స్టేషన్ వద్ద పోలీసులకు అనుమాస్పదంగా పడిఉన్న ఒక సూట్ కేసు లభించింది. ఆ సూట్ కేసు తెరిచి చూస్తే అందులో ఒక యువకుడి మృతదేహం ఉంది. మెట్రో స్టేషన్ పరిసరాల్లో ఉన్న సీసీటీవి వీడియోలను పరిశీలించగా.. ఒక కారులో ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆ సూట్ కేసుని అక్కడ పడేసినట్లు కనిపించింది...

ఓనర్‌ని బ్లాక్‌మెయిల్ చేసిన ఉద్యోగి.. మెట్రో స్టేషన్ వద్ద అనుమాస్పదంగా పడి ఉన్న సూట్ కేసు.. అసలా ఓనర్ ఏం చేశాడంటే..

మెట్రో స్టేషన్ వద్ద పోలీసులకు అనుమాస్పదంగా పడిఉన్న ఒక సూట్ కేసు లభించింది. ఆ సూట్ కేసు తెరిచి చూస్తే అందులో ఒక యువకుడి మృతదేహం ఉంది. మెట్రో స్టేషన్ పరిసరాల్లో ఉన్న సీసీటీవి వీడియోలను పరిశీలించగా.. ఒక కారులో ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆ సూట్ కేసుని అక్కడ పడేసినట్లు కనిపించింది. ఆ కారు నెంబర్ ఆధారంగా పోలీసులు ఆ ఇద్దరు వ్యక్తులను పట్టుకొని ప్రశ్నించగా.. షాకింగ్ విషయాలు తెలిశాయి.


వివరాల్లికి వెళితే.. ఢిల్లీలోని సరోజినీ నగర్ మెట్రో స్టేషన్ వద్ద పోలీసులకు ఒక సూట్ కేసులో ఒక శవం దొరికింది. ఆ యువకుడి పేరు శంషేర్ ఖాన్ అని, అతను ఒక  బట్టల వ్యాపారి రాకేశ్ శర్మ ఆఫీసులో పనిచేసేవాడని పోలీసుల విచారణలో తేలింది. అలాగే మెట్రో స్టేషన్ పరిసరాల్లో ఉన్న సీసీటీవి వీడియోలను పరిశీలించగా.. ఒక కారులో ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆ సూట్ కేసుని అక్కడ పడేసినట్లు కనిపించింది. ఆ కారు నెంబర్ ఆధారంగా పోలీసులు ఆ ఇద్దరు వ్యక్తులను పట్టుకొని ప్రశ్నించారు. ఆ ఇద్దరిలో ఒకరు ఆ బట్టల వ్యాపారి రాకేశ్ శర్మ్ మేనల్లుడని తెలసింది. మరొకరు ఆ మేనల్లుడి స్నేహితుడు.  శంషేర్ ఖాన్‌ను హత్య చేయమని రాకేశ్ శర్మ చెప్పాడని వారు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో పోలీసులు రాకేశ్ శర్మని అరెస్టు చేసి హత్య చేయడానికి గల కారణం తెలుసుకున్నారు.


పోలీసుల కథనం ప్రకారం.. ఢిల్లీకి చెందిన రాకేశ శర్మ ఒక పెద్ద బట్టల వ్యాపారి. అతని ఆఫీసులో పనిచేసే శంషేర్ ఖాన్ అనే యువకుడితో రాకేశ్ శర్మ హోమో సెక్సువల్(పురుషుల మధ్య) సంబంధం పెట్టుకున్నాడు. ఒకరోజు శంషేర్ ఖాన్ తనకు డబ్బు అవసరమని తన ఓనర్ రాకేశ్‌ని అడిగాడు. కానీ రాకేశ్ డబ్బులివ్వకపోవడంతో.. శంషేర్ వారి మధ్య జరిగిన శృంగార దృశ్యాల వీడియాలను అందరికీ చూపెడతానని బెదిరించాడు. శంషేర్ తనను అలా బ్లాక్ మెయిల్ చేయడంతో రాకేశ్‌ భయపడిపోయాడు. ఎలాగైనా ఆ వీడియోలు బయటికి రాకుండా ఉండేందుకు.. శంషేర్‌ను హత్య చేయాలనుకున్నాడు. దానికోసం తన మేనల్లుడితో కలిసి ఒక ప్లాన్ వేశాడు. 


ప్లాన్ ప్రకారం శంషేర్‌కు డబ్బలిస్తానని రాకేశ్ ఊరి చివర పిలిచాడు. అక్కడ రాకేశ్ తన మేనల్లుడి, అతని స్నేహితుడితో కలిసి ఒక నైలాన్ తాడుతో శంషేర్ గొంతుకు ఉరి వేసి హత్య చేశారు.  ఆ తరువాత ఒక సూట్ కేసులో శంషేర్ శవాన్ని దాచి పెట్టి మెట్రో స్టేషన్ వద్ద ఆ సూట్ కేసు పడేశారు.


పోలీసుల బట్టల వ్యాపారి రాకేశ్ శర్మ, అతని మేనల్లుడు, మేనల్లుడి స్నేహితులను శంషేర్ హత్య కేసులో అరెస్టు చేశారు. 


Updated Date - 2022-02-17T05:35:45+05:30 IST