పోలీసులు నిందితులకు అండగా నిలుస్తున్నారు: విష్ణువర్థన్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-01-16T20:43:13+05:30 IST

విగ్రహాల ధ్వంసం కేసులో బీజేపీ నేతలు ఉన్నారని.. డీజీపీ సవాంగ్‌ చెప్పడం సిగ్గుచేటని బీజేపీ నేత విష్ణువర్థన్‌రెడ్డి అన్నారు.

పోలీసులు నిందితులకు అండగా నిలుస్తున్నారు: విష్ణువర్థన్‌రెడ్డి

అనంతపురం: విగ్రహాల ధ్వంసం కేసులో బీజేపీ నేతలు ఉన్నారని.. డీజీపీ గౌతమ్ సవాంగ్‌ చెప్పడం సిగ్గుచేటని బీజేపీ నేత విష్ణువర్థన్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు వైసీపీకి కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విగ్రహాలు ధ్వంసం చేయాలని పరోక్షంగా రెచ్చగొట్టిన.. మంత్రి కొడాలి నానిని వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు నిందితులకు అండగా నిలుస్తున్నారని విష్ణువర్థన్‌రెడ్డి ఆరోపించారు.

Updated Date - 2021-01-16T20:43:13+05:30 IST