పోలీస్‌ సిబ్బంది క్వార్టర్లు కూల్చివేత

ABN , First Publish Date - 2021-01-18T04:53:48+05:30 IST

రాజాం మెయిన్‌రోడ్‌లోని పోలీసు సిబ్బంది నివాస గృహాలు (క్వార్టర్లు)ను కూల్చివేసే పనులు ప్రారంభమయ్యాయి.

పోలీస్‌ సిబ్బంది క్వార్టర్లు కూల్చివేత
జేసీబీతో భవనాలు కూలుస్తున్న దృశ్యం

రాజాం రూరల్‌, జనవరి 17: రాజాం మెయిన్‌రోడ్‌లోని పోలీసు సిబ్బంది నివాస గృహాలు (క్వార్టర్లు)ను కూల్చివేసే పనులు ప్రారంభమయ్యాయి. 1996లో పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నిర్మించిన క్వార్టర్లను అప్పటి హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడి ్డప్రారంభించారు. కాలక్రమంలో ఆ భవనాలు శిథిలావస్థకు చేరుకోవడంతో సిబ్బంది ఎవరూ వాటిలో ఉండకుండా ఖాళీ చేశారు. భవనాలు నివాసానికి అనుకూలంగా లేకపోవడంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో అద్దె ఇళ్లలో ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇదిలా ఉండగా నూతనంగా నివాస గృహాల నిర్మాణానికి పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో స్థలం కేటాయిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఏడాది కిందట ఎస్పీ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అయితే పాత క్వార్టర్ల స్థలం కోట్లాది రూపాయలు విలువచేస్తుందని, ఈ స్థలంలో నిర్మాణాలు చేపట్టకుండా ఇతర ప్రాంతంలో చేపట్టడం వల్ల పలు అనుమానాలకు తావిస్తోందని పలువురు పేర్కొంటున్నారు. పాత స్థలంలో నిర్మాణాలు చేపడితే బాగుంటుందని పలువురు సిబ్బంది కోరుతున్నారు.

Updated Date - 2021-01-18T04:53:48+05:30 IST