ఈటల వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు
ABN , First Publish Date - 2021-10-30T21:21:22+05:30 IST
కమలాపూర్ మండలం మరిపెల్లిగూడెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కాన్వాయ్లోని మూడు వాహనాలను పోలీసులు
హుజురాబాద్: కమలాపూర్ మండలం మరిపెల్లిగూడెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కాన్వాయ్లోని మూడు వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. మూడు వాహనాలకు అనుమతి లేదంటూ.. ఒక వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఈటల రాజేందర్ పీఆర్వో చైతన్యను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాన్ని సీజ్ చేశామని కమలాపూర్ సీఐ కిషన్ తెలిపారు. మరోవైపు జమ్మికుంట 28వ వార్డులో ఈటల అనుచరుల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. టీఆర్ఎస్ కౌన్సిలర్ దీప్తి ఇంట్లో డబ్బులు పంచుతున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో కౌన్సిలర్ దీప్తి ఇంటి ఎదుట బీజేపీ కార్యకర్తల ఆందోళనకు దిగారు. ఎన్నికల అధికారులు వచ్చి డబ్బులు స్వాధీనం చేసుకోవాలంటూ డిమాండ్ చేశారు. కౌన్సిలర్ దీప్తి ఇంట్లో ఉన్న ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బయటకు రావాలంటూ నినాదాలు చేశారు. ఘటనా స్థలికి ఏసీపీ వెంకటర్రెడ్డి, పోలీసులు చేరుకున్నారు.